బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్ ఎవరు అనే దానిపై స్పందించిన ఈటల రాజేందర్.. పార్టీలో ఉన్నోళ్లు సీనియర్లు కాదని, రాజకీయాల్లో ఉన్నవాళ్లే అసలైన సీనియర్లు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు.. సీనియర్లు, జూనియర్లు అనే చర్చ జరుగుతున్న వేళ.. ఈటల రాజేందర్ చేసిన ఈ పరోక్ష వ్యాఖ్యలు తమ పార్టీ గురించే ఆయన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.