వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరచాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు. తాజాగా శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను వైఎస్ జగన్ నియమించారు. సాకే శైలజానాథ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.