జగిత్యాల సభ నుంచి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పార్టీలో చేరగానే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్లో కీలక పదవిని కట్టబెట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ఇతర జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జీవన్ రెడ్డి సేవలు వినియోగించుకుంటామని తేల్చి చెప్పారు.