ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు గల్లంతయ్యారు. ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలోని జంఝావతి రబ్బర్ డ్యాములో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పిక్నిక్ కోసమని జంఝావతి డ్యామ్ వద్దకు వెళ్లగా.. అందులో పడి గల్లంతయ్యారు. అటు అల్లూరి జిల్లాలో రైవాడ రిజర్వాయర్ వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతుకాగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.