పాలకొండలో జగన్ క్రేజ్ చూశారా.. కిక్కిరిసిపోయిన రోడ్లు

1 month ago 6
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో గురువారం పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రాజశేఖర్ భార్య రుక్మిణమ్మ, కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ల మాజీ సీఎం ఓదార్చారు. జగన్‌ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీశ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. దీంతో పాలకొండ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయి.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. జగన్ కాన్వాయ్‌ ముందుకు వెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Read Entire Article