విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని మురళీ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తులో ఉంటున్న పద్మావతి అనే మహిళ.. కింద ఉన్న పాల ప్యాకెట్ను కేబుల్ వైర్తో కట్టిన బుట్ట ద్వారా పైకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కరెంట్ తీగలు తగలటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు మధురవాడలోనూ కరెంట్ షాక్ కొట్టి ఓ వ్యక్తి చనిపోయాడు.