హైదరాబాద్లో వింత ఘటన వెలుగు చూసింది. కూకట్పల్లికి చెందిన ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన పాలు విరిగిపోవడంతో ఆగ్రహించి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. 'నా డబ్బు వృథా అయ్యింది.. నాకు న్యాయం కావాలి' అంటూ పోలీసులను కోరాడు. మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు.. అతని పట్టు వీడకపోవటంతో సూపర్ మార్కెట్ మేనేజర్పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది.