సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కనిపించకుండా పోయిన ఎనిమిది మంది బూడిదయ్యుంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు చేసుకోవాలని సూచించారు. తక్షణ సాయం కింద రూ.15 లక్షల చెక్కులు అందజేసిన అధికారులు. జూన్ 30న జరిగిన ఈ పేలుడులో 44 మంది మృతి చెందారు. ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం పరిహారం ప్రకటించాయి. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు సమయం పడుతుందని కార్మికులను స్వస్థలాలకు వెళ్లాలంటూ సూచించారు.