తెలంగాణ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచిన పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల FIRలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. సిగాచి ఫ్యాక్టరీ సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, మెషినరీ పాతది కావడం, కనీస ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.