పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో చోటు చేసుకున్న పేలుడు పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఘటనా స్థలంలో కార్మికుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.