తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి శివారు ప్రాంతంలో రోడ్డు పక్కన నాలుగు రోజుల కిందట కనిపించిన సంగతి తెలిసిందే. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయమై కీలక ఆదేశాలు జారీ చేశారు