పింఛన్ డబ్బులలో ఇంటి పన్ను బకాయిలు కట్.. ఇదేందయ్యా?

3 months ago 8
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే అక్కడక్కడా సిబ్బంది పింఛన్ల పంపిణీలో చేతివాటం ప్రదర్శిస్తున్న వార్తలు చూస్తునే ఉన్నాం. అయితే కాకినాడ జిల్లా తునిలో ఊహించని ఘటన జరిగింది. తుని మండలం లోవకొత్తూరులో ఓ ఉద్యోగి పింఛన్ డబ్బులలో ఇంటి పన్ను బకాయి కట్ చేయడం వివాదాస్పదమైంది. స్థానికులు ఈ విషయాన్ని గట్టిగా నిలదీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article