తెలంగాణలో చేయూత పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా చేసేందుకు మంత్రి సీతక్క చర్యలు చేపట్టారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అర్హులకు మాత్రమే పెన్షన్ అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. సాంకేతిక సమస్యల వల్ల పంపిణీ ఆలస్యమైతే వెంటనే తెలియజేయాలని సూచించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళా సంఘాలకు రుణాలు, ఇందిరా క్యాంటీన్ల ద్వారా అండగా ఉంటామని తెలిపారు. ఫ్రీ బస్సు పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోందని మంత్రి పేర్కొన్నారు.