హైదరాబాద్ గచ్చిబౌలి ఐఎస్బీ క్యాంపస్లో తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడంటూ ఓ 40 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నిందితుడు ప్రథమ్ సింగ్కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించింది. ఘటన జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడంపై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ల ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసు దాఖలులో జరిగిన సుదీర్ఘ జాప్యం, పిటిషనర్ వయసును పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను రద్దు చేసింది.