పిఠాపురం: ఆలయంలో ఇదేం పనమ్మా.. ఎంత భక్తి అయితే మాత్రం ఇలా చేస్తారా?

4 months ago 10
Pithapuram Woman at Temple: కోరిన కోరికలు నెరవేర్చు స్వామీ.. అంటూ మనందరం ఆలయంలో మొక్కుకుంటూ ఉంటాం. కొబ్బరి కాయలు కొడతాం.. తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటాం. అలాగే కోరికలు నెరవేరిన వారు ఆలయంలోని హుండీలలో కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కానీ పిఠాపురంలో ఓ భక్తురాలు మాత్రం వింతగా ప్రవర్తించింది. హారతి కర్పూరం వెలిగించి.. ఆలయంలోని హుండీలో వేసింది. కొద్దిసేపటి తర్వాత హుండీలో నుంచి పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. హుండీలో నీళ్ళు పోసి పొగను ఆర్పివేశారు. అయితే అప్పటికే కొన్ని నోట్లు కాలిపోగా.. నీటిలో తడిచిన మరికొన్నింటిని హెయిర్ డ్రయర్ సాయంతో ఆరబెట్టారు. పిఠాపురంలోని శ్రీపాదవల్లభ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Entire Article