డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య తలెత్తిన ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంగళవారం రోజు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మధ్య ఫ్లెక్సీ పంచాయితీ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు.. వర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. వర్మకు సూచనలు చేయాలని పల్లాను ఆదేశించారు.