డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోవటంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు వర్మ అనుచరుల నినాదాలతో పిఠాపురం పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి.