ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, నీటి షవర్లు ఏర్పాటు చేయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాలంటీర్లు, పోలీసులను మోహరించారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా మహా శివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయానికి ఇన్సూరెన్స్ చేయించారు.