తెలంగాణలో పిడుగుపాటు మరణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్షాలు, వైరల్ ఫీవర్లు, పంటల సాగుపై చర్చించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.