ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం రాత్రి మన్యం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు బుధవారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.