మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ముద్రగడ మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్.. కోలుకుంటున్నారని, తిరిగి తమ మధ్యకు వస్తారని ఆశించామన్నారు. కానీ ఈలోపే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్.. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.