ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తోడబుట్టిన చెల్లెలిని అత్యంత కిరాతకంగా హత్యచేశాడో అన్న. పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కోటి రూపాయలకు పైగా డబ్బులు వస్తాయనే అత్యాశతో చెల్లెల్ని దారుణంగా హత్య చేశాడు. ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఏడాది కిందట ఈ హత్య జరగ్గా.. తాజాగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.