కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఇది పీఎం కిసాన్కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు.. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు తప్పనిసరి. ఈ కార్డును ఆధార్తో అనుసంధానం చేస్తారు. దీని ద్వారా రైతు సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు.. దీని ద్వారా బ్యాంకు రుణాలు పొందడం సులభం అవుతుంది. గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు పట్టా పాసుపుస్తకం, ఇతర పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండేది. ఇకపై రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును బ్యాంకు అధికారులకు చూపిస్తే సరిపోతుంది.