ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రాని వారి కోసం ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదు. అలాంటి రైతులు సంబంధిత పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సందర్శించి.. దరఖాస్తు చేసుకుంటే, అధికారులు వాటిని పరిశీలిస్తారు. అర్హత ఉంటే అర్హుల జాబితాలో చేర్చుతారని అధికారులు చెప్తున్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.