టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కార్యదర్శిగా (పీఏ) ఓ ట్రాన్స్జెండర్ను నియమించుకున్నారు. బీకాం చదివిన ఓ ట్రాన్స్జెండర్ అమ్మాయి.. ఉద్యోగం కావాలని గళ్లా మాధవి కార్యాలయంలో సంప్రదించారు. దీంతో ట్రాన్స్జెండర్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆమెను పీఏగా నియమించుకున్నారు గళ్లా మాధవి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.