తెలంగాణలో పీజీ వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ చారిత్రక నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య అవకాశాలు మెరుగుపడనున్నాయి.