జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో.. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. పీజేఆర్ మరణానంతరం.. ఆయన గౌరవార్థం ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చంద్రబాబు నిర్ణయించినా.. పీజేఆర్ కుటుంబంపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టి దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్సే.. అని ఆయన మండిపడ్డారు. సానుభూతి ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదన్నారు. అవకాశవాద రాజకీయాలను వీడి, కష్టపడే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటేయాలని కోరారు. బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్మక్కయ్యాయని.. అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.