అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బోడుమల్లివారిపల్లిలో శివలింగం బయటపడింది. ఊరి శివార్లలోని మల్లేశ్వర కొండపై శివలింగం లభ్యమైంది. కొంతమంది పశువుల కాపర్లు ఈ శివలింగాన్ని కొండ మీద గుర్తించారు. ఊరిజనానికి ఈ సమాచారం చేరవేశారు. దీంతో స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో మల్లేశ్వర కొండపైకి చేరుకుని శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గుడి కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.