అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు కావాల్సిన రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అందింది. హైదరాబాద్ ఆస్పత్రిలో శనివారం ఉదయం ఈ ఇంజెక్షన్ అందించారు. మంత్రి నారా లోకేష్ దగ్గరుండి ఇంజెక్షన్ ఇప్పించారు. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేస్తే నారా లోకేష్ పబ్లిషిటీ చేసుకుంటున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది.