లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 550 నుంచి 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81కి సవరణలు చేయనున్నారు. ఈ పునర్విభజన వల్ల తెలంగాణలో లోక్సభ స్థానాల సంఖ్య 17 నుంచి 26 లేదా 27కు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జనాభా అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త ఎంపీ స్థానాలు ఏర్పడనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుతో.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ నుంచి కనీసం 9 మంది మహిళలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు.