కొమురం భీం ఆసిఫాబాద్ ల్లా ఇటిక్యాలపహాడ్లో హృదయవిదారక ఘటన జరిగింది. పులి దాడిలో మరణించిన తన దూడ కళేబరం వద్దకు ఓ ఆవు అటవీ అధికారులను తీసుకెళ్లింది. ఆదివారం అడవికి వెళ్లిన దూడ పులి దాడిలో మరణించగా.. ఆవేదనలో ఉన్న ఆవును సోమవారం యజమాని విడిచిపెట్టాడు. ఆవు కిలోమీటరు దూరం వెళ్లి బిడ్డ జాడ చూపింది. మూగజీవి కన్నప్రేమను చూసి అధికారులు, స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి.