తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే సైబీరియన్ ఫ్లెమింగో పక్షులకు.. ఇది శాశ్వత నివాసంగా మారడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కు.. లక్షలాది మంది పక్షి ప్రేమికులు హాజరుకానున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.