Pulivendula ZPTC Bypoll: పులివెందులలో రాజకీయం వేడెక్కింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల జెడ్పీటీసీగా ఉన్న మహేశ్వర్ రెడ్డి చనిపోవటంతో ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ తరుపున మహేశ్వర్ రెడ్డి తనయుడు హేమంత్ కుమార్ పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి బరిలోకి దిగుతున్నారు. దీంతో పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.