పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను మీడియా బాగా హైలెట్ చేసింది. వాస్తవానికి జెడ్పీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అది జగన్ ఫ్యామిలీకి కంచుకోట కావడంతో ఈ ఎన్నికల ఫలితాల కోసం.. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురు చూసినంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ బైపోల్లో టీడీపీ విజయం సాధించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా.. వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడం మాత్రం విస్మయానికి గురి చేసింది.