Nandamuri Balakrishna On Pulivendula Zptc Tdp Win: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. పులివెందులలో 40 ఏళ్ల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని ఆయన అన్నారు. గతంలో ఓట్లు వేయడానికి భయపడే పరిస్థితులు ఉండేవని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ గెలుపు ప్రజల్లో టీడీపీకి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఓటమి తర్వాత జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శించారు.