తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన అధికార, ప్రతిపక్షాల మధ్య మంటలు రేపుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దీనిపై విమర్శలు గుప్పిస్తుండగా... అధికార కాంగ్రెస్ వాటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో కేసీఆర్, కేటీఆర్, ఈనో ఫోటోలతో ఫ్లెక్సీలు వేసింది. అయితే, సీఎం దావోస్ పర్యటనకు డబ్బుల వృధా అంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చరకలు వేశారు. బీఆర్ఎస్ నేతల తమదైన శైలిలో స్పందిస్తున్నారు.