చమురు ధరలు పెరిగితే.. చాలా వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే.. వస్తువుల రవాణాకు ఉపయోగించే వాహనాలు.. పెట్రోల్, డీజిల్లతో నడుస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ చమురు వాత ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్కు కూడా భారంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్లే.. ప్రైవేటు వాహనాలు కూడా.. ట్రాన్స్పోర్టు ఫీజులను పెంచేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రుల జేబుకు చిల్లు పడుతోంది.