దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ మీద రూ.3 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పెట్రోల్ మీద రూ.3 పెంపు అనేది చాలా అత్యల్పం, అత్యవసరమైన చర్యగా విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో వీటితో పాటుగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పెంపు, ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు.