‘పెన్నుల మీద మన్ను గప్పితే గన్నులై మొలకెత్తుతాయి’.. సీఎం రేవంత్ రెడ్డి..

3 months ago 10
తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ సంస్మరణ సభ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్దరన్న, గూడ అంజన్న, అందెశ్రీ, గోరెటి వెంకన్న వంటి కవులు గళం విప్పితేనే తెలంగాణ కల సాకారమైందని కొనియాడారు. బడికి వెళ్లని అందెశ్రీ 'జయ జయహే తెలంగాణ' నినాదంతో ఉద్యమానికి ఊపిరిలూదారని ప్రశంసించారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ కోసం కృషి చేసిన అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని సీఎం హామీ ఇచ్చారు.
Read Entire Article