తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలు అయినప్పటికీ కూడా చలితీవ్రత తగ్గడం లేదు. చాలాచోట్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల స్థాయికి పడిపోయాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో వైద్యులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. చలితీవ్రత, పొగమంచుల నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని చెప్తున్నారు.