బెయిల్ వచ్చినా జరిమానా కట్టలేక జైళ్లలో మగ్గుతున్న పేద ఖైదీలకు కేంద్రం ఊరటనిచ్చింది. కేంద్ర హోంశాఖ 'పేద ఖైదీలకు మద్దతు' పథకం కింద జరిమానాలు చెల్లించనుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు అర్హులను గుర్తించి, నేరాల నమోదు సంస్థకు నివేదిక పంపుతాయి. అవినీతి, మాదకద్రవ్యాల కేసుల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ఇది పేదలకు న్యాయం చేకూర్చడమే కాకుండా, జైళ్ల రద్దీని తగ్గిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.