తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులపై ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు. నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని, ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అల్వాల్, సనత్నగర్, కొత్తపేట టిమ్స్లను న్యూరో, కార్డియాక్, గ్యాస్ట్రో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా తీర్చిదిద్దుతున్నారు.