తెలంగాణలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లా టీచింగ్ హాస్పిటల్స్ను సూపర్ స్పెషాలిటీ కేంద్రాలుగా మార్చాలని, అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల రోగులకు హైదరాబాద్పై భారం తగ్గి, అక్కడే మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.