తెలంగాణలోని పేద రోగులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు సర్కార్ రాష్ట్రంలో కొత్తగా 31 ఆసుపత్రులను నిర్మిస్తోంది. దాంతో పాటుగా మరో 38 ఆసుపత్రులను 100, 250 పడకలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. వీటిల్లో 9 రకాల వైద్య సేవలను అందించనున్నారు. అందుకు అవసరమైన డాక్టర్ల నియామకంతో పాటు.. అత్యాధునికి వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.