ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణానికి అయ్యే అదనపు భారం తగ్గించేందుకు మేస్త్రీలకు శిక్షణ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. పేదలకు తక్కువ ఖర్చుతో పటిష్ఠంగా, పూర్తి భద్రతతో ఇండ్లు ఎలా నిర్మించాలో వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.