తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి విస్తీర్ణం నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. 600 చ.అ. మించి పునాది వేసిన లబ్ధిదారులకు కూడా బిల్లులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పునాది పైన 600 చ.అ లోపే ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇస్తే బిల్లులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అవగాహన లేని కారణంగా నిబంధనలు అతిక్రమించిన పేదవారికి ఇది నిజంగా ఊరటనిచ్చే అంశమే.