తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలవుతోందని గృహనిర్మాణ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం వెల్లడించారు. ఇప్పటికే 1.74 లక్షల మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారు, 57 వేల గృహాలు బేస్మెంట్ దశలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం రూ.386.12 కోట్లు విడుదల చేసిందని.. 12,700 మంది లబ్ధిదారుల వివరాలపై అభ్యంతరాలు రాగా, 10,700 మంది అర్హులుగా తేలారని తెలిపారు. 1,950 మంది అనర్హుల స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.