తెలంగాణలో అర్హులైన పేదలకు భూములు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డం పెట్టుకొని చాలా మంది భూములు ఆక్రమించారని ఆరోపించారు. ఆయా భూములను భూ భారతి పోర్టల్ ద్వారా ఆడిట్ చేయించి స్వాధీనం చేసుకుంటామన్నారు. అనంతరం వాటిని పేదలకు పంచనున్నట్లు వెల్లడించారు.