నాగర్కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఓ లేడీ డాక్టర్ రోగులను పట్టించుకోకుండా ఫోన్లో 'క్యాండీ క్రష్' గేమ్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్యూలో ఉన్న రోగులను బయటే నిలిపి డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని ఆరోపణలున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంటనే స్పందించి.. డాక్టర్ ఆయేషాకు మెమో జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆదేశించారు.