రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాలలో నకిలీ 500 రూపాయల నోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. బ్యాంకు నుంచి పొందిన రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో.. సభ్యుల నుంచి వచ్చిన నగదులో నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. ఒక టీం లీడర్కు ఇప్పటికే మూడుసార్లు నకిలీ నోట్లు రావడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇకపై బ్యాంకు సమయాల్లోనే నగదు చెల్లించాలని టీం లీడర్ సభ్యులకు సూచించారు.